ELR: జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం పాఠశాలలో హోమియోపతి వైద్యుడు డాక్టర్ శ్యామ్ విద్యార్థులకు సన్ స్ట్రోక్ పై అవగాహన కల్పించారు. వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువగా నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని సూచించారు. తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.