ELR: పోలవరం మండలం బోడిగూడెంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను MPDO శ్రీనివాస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న భోజన నాణ్యత, తాగునీటి వసతి, వసతి గృహ సౌకర్యాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు.