KDP: చెన్నూరులో గంజాయి, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. లక్ష్మీనగర్, దౌలతాపురం, జగనన్న కాలనీల్లో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.