కృష్ణా: చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ కోట విజయ రాధిక, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్చాంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, సీనియర్ అసిస్టెంట్ శ్యాంసన్, టైపిస్టు బ్రహ్మానందరావు, సిబ్బంది పాల్గొన్నారు.