ELR: పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.30 లక్షల విలువైన నిలువ ఉంచిన అక్రమ బాణాసంచాను పోలీస్, ఫైర్, రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాణాసంచా నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే అది భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తుందని అధికారులు తెలిపారు. నిల్వ కేంద్రం నివాస ప్రాంతాలకు దూరంగా, కేవలం కాంక్రీట్ భవనాల్లో మాత్రమే ఉండాలన్నారు.