NTR: నందిగామ పట్టణం అనాసాగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రంను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రయాణికులు, సామాన్య ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి చలివేంద్రాలు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీరుస్తాయని తెలిపారు.