WG: విశాఖపట్నంలో నిర్వహించిన 31వ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటారు. 9వ తరగతి చదువుతున్న ఆర్. వేణు అండర్-17 విభాగంలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సూర్య తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.