NTR: చందర్లపాడు మండలం కొడవటికల్లులో రూ.45 లక్షల వ్యయంతో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని భూమి పూజ చేశారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించడం ద్వారా వ్యవసాయ రంగం ఇంకా ఎదగాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రఘురాం పాల్గొన్నారు.