GNTR: పెదనందిపాడు మండలం వరగానిలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస పాఠశాల బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బస్సు నుంచి చిన్నారి దిగుతుండగా ఒక్కసారిగా బస్సు ముందుకు కదిలింది. ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే చిన్నారి దుర్మరణం చెందింది.