కోనసీమ: జిల్లా పరిధిలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు, ఆన్లైన్ గేమింగ్ పేరుతో అక్రమ బెట్టింగ్ కు కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, అనధికారిక యాప్ల ద్వారా యువతను లక్ష్యంగా చేసుకున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.