NDL: గడివేములకు చెందిన భారతి ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో సత్తా చాటింది. HYDలో చదువుతూ MPCలో 470 మార్కులకు గాను, 468 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. పదో తరగతి వరకు గడివేములలోనే చదివింది. గతేడాది పదో తరగతిలో ఫలితాలలోనూ 600కు 587 మార్కులు పొంది మండల టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినిందించారు.