KRNL: ఐపీఎల్ వేళ ఆన్లైన్ బెట్టింగ్లు, జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి హెచ్చరించారు. యువకులు, విద్యార్థులు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఐపీఎల్ సీజన్ సమయంలో కొంతమంది యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్ల వైపు వెళ్తున్నారని పేర్కొన్నారు.