AP: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో విషాదం నెలకొంది. పాఠశాల బస్సు కింద పడి నాలుగేళ్ల విద్యార్థి మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై విద్యార్థి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. బస్సులో సహాయకుడు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.