KDP: సిద్ధవటం మండలంలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామల వీధులలో తిరుగుతూ పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునే వృద్ధులు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఎండ వేడిని తట్టుకోలేక వ్యాపారులు చెట్ల నీడన సేద తీరుతున్నారు.