SKLM: ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న తీరును సీఐ ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. శుక్రవారం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని నిబంధనలను మితిమీరితే కేసులు పెట్టడం తప్పదని హెచ్చరించారు.