SS: ధర్మవరం నియోజకవర్గ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రెండో విడత సైకిళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. సంస్కృతి సేవా సమితి సహకారంతో ఏప్రిల్ 14న మార్కెట్ యార్డ్లో ఈ వేడుక జరుగుతుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని 24 పాఠశాలలకు చెందిన 1000 మంది పదో తరగతి విద్యార్థులకు మంత్రి వీటిని అందజేస్తారు.