E.G: ఉండ్రాజవరంలో సర్వహంగులతో అధునాతనంగా నిర్మించిన ‘బుద్ధవిహార్’ మే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బౌద్ధ పీఠాధిపతి పూజ్య అనాలియో రాజమహేంద్రవ ఎంపీ పురందేశ్వరికి ఆహ్వాన పత్రాన్ని అందించారు. సోమవారం రాజమండ్రి ఎంపీ పార్టీ కార్యాలయంలో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హరిక, తదితరులు పాల్గొన్నారు.