E.G: చిరకాల వాంఛ, దశాబ్దాల కల అయిన మహిళలకు లోక్ సభ, రాష్ట్ర శాసనసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయమని ఇవాళ రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో కలిసి మహిళలందరి తరుపున ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సాధికారత అంటే కేవలం ఒక నినాదం కాదన్నారు.