SKLM: మహాత్మ జ్యోతి బాపూలే 199వ జయంతి సందర్భంగా ఇవాళ పలాస టీడీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గౌతు శిరీష పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా విస్తరణకు జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహాత్మా జ్యోతి బాపూలే అని ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు.