పోలవరం జిల్లా కలెక్టర్ కే.దినేష్ కుమార్ గుర్తేడు మండలం సింగనికోట గ్రామంలో శనివారం పర్యటించారు. ఐదు కిలోమీటర్ల కొండలు, వాగులు కాలినడకన దాటి గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాలపై గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పండ్ల తోటల కోసం మొక్కలు అందిస్తామని హామీ ఇచ్చి, గ్రామాభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.