AKP: టీడీపీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు తెలిపారు. ఇవాళ కే కోటపాడు మండలం గొట్లం, శృంగవరంలో పర్యటించి కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పూర్తితో ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.