SKLM: హఠాత్తుగా సంభవించిన అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటబొమ్మాలి అగ్నిమాపకాధికారి రెడ్డి కోరారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరుగునున్న అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్ ప్రారంబించారు. అగ్నిమాపక కేంద్రంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తు జెండా ఎగురవేసి నివాళులర్పించారు.