KRNL: ఎమ్మిగనూరు పట్టణం 30వ వార్డులో 21 ఏళ్ల యువకుడు గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ, వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ కోరిశెట్టి విశ్వనాధ్, తదితర నాయకులు మృతుడి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.