W.G: చంద్రగ్రహణం పురస్కరించుకుని భీమవరం గునుపూడిలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తిరిగి 4వ తేదీ (బుధవారం) ఉదయం 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వివరించారు.