కోనసీమ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేసే ప్రభుత్వం అని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం నేదునూరు సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం రైతులకు ఉచితంగా విత్తనాలు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.