కృష్ణా: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సీఐ నున్న రాజు రోడ్డు భద్రత నియమాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకుండా వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామన్నారు.