SS: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్మవరంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 479 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 146 మందికి శుక్లాల ఆపరేషన్లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. మరో 92 మందిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని బేస్ హాస్పిటల్కు పంపారు.