E.G: రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం-సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.