BPT: ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. సెకండియర్లో 75 శాతం, ఫస్టియర్లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్లో 8,358 మంది పరీక్ష రాయగా.. 6,252 మంది పాసయ్యారు. ఫస్టియర్లో 8,831 మందికి గానూ 6,361 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరగనున్నాయి. ఫీజు చెల్లింపునకు అధికారులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు గడువు ఇచ్చారు.