E.G: రంగంపేట మండలం ST రాజపురంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని గ్రామస్తులు హర్షo వ్యక్తం చేశారు. SVS స్కీములో రూ. 83.25 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రూ.30 లక్షలతో 10 సిమెంటు రోడ్లకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఈ బురద రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా ఉండేదని నేడు సమస్యకు పరిష్కారo అయ్యిందని వెల్లడించారు.