KMM: వేంసూరు మండలం వెంకటాపురంలో విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపనకు బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాకను పురస్కరించుకుని పోలీసులు బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో పాలా వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్ సాధు లక్ష్మి, గంగాధర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.