అన్నమయ్య: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి పట్టణంలోని రింగ్ రోడ్ నూర్ మసీదు వద్ద యూసుఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ నెలలో జరిగే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, సహృద్భావాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.