AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారని తెలిపారు. మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. కల్తీ పాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయిందని పేర్కొన్నారు.