అనకాపల్లి కలెక్టరేట్లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సైన్యాన్ని ముచ్చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి అని అన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.