SKLM: దివ్యాంగుల సంక్షేమం, వారి సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహించే ‘స్వాభిమాన్’ వేదికను శుక్రవారం నిర్వహించనున్నట్లు దివ్యాంగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొడ్డేపల్లి శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.