TG: ఎన్నికల జాబితాల పరిశుభ్రతను కాపాడడం EROల బాధ్యత అని CEC సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడంతో పాటు, అనర్హుల పేర్లను చట్టబద్ధంగా తొలగించాల్సిన అవసరం ఉందని సూచించారు. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, HYD జిల్లాలకు చెందిన మొత్తం 50 మంది EROలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే త్వరలో చేపట్టనున్న SIRపై చర్చించారు.