అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గుచేటని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. భారతజాతి ప్రయోజనాలు కాపాడమంటే పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం దుర్మార్గమన్నారు. నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టా అని పేర్కొన్నారు.