AP: మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఈ సహాయం అందించినట్లు వెల్లడించారు. దీంతో 95 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. రూ.4.75 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు.