NRML: సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రహదారి భద్రత ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ భోజన్న మంగళవారం ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు 100 శాతం పాల్గొని తమ పాఠశాలను నమోదు చేయాలని వారు సూచించారు. క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, చిత్రలేఖనం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలని, మార్చి 14 చివరి తేదీ అని పేర్కొన్నారు.