SRD: మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల రెడ్డి కొనియాడారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ముఖ్యంగా వ్యాపార రంగంలో మహిళలు ఎదిగేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.