KDP: కమలాపురంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నిరసన తెలిపింది. పార్టీ సమన్వయకర్త నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వరస్వామి గుడిలో టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అక్రమ సంబంధాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడును ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని నరేన్ డిమాండ్ చేశారు.