ATP: బెంగళూరు-అనంతపురం-బెంగళూరు మెము (66559/60) ప్యాసింజర్ రైలుకు చెన్నసంద్ర స్టేషన్లో స్టాపింగ్ రద్దును మే నెలాఖరు వరకు పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్కడ చేపడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని వివరించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.