ప్రకాశం: పొన్నలూరు మండలం చెన్నుపాడు సమీపంలో సంగమేశ్వర డ్యాం నిర్మాణానికి రూ.166.40 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సంగమేశ్వర రిజర్వాయర్ ద్వారా కొండపి నియోజకవర్గంలో 9500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ. 25 కోట్లు కేటాయించారని అన్నారు.