MDK: నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామస్తుల కల నెరవేరింది. కొన్ని దశాబ్దాలుగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం నుండి ఆర్టీసీ బస్సు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు,