E.G: రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో RDSS పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కళ్యాణ్ నగర్, ఆదర్శ్ నగర్, జంగాల కాలనీ, ఉద్యోగుల కాలనీ, క్వారీ ప్రాంతం, నూకాలమ్మ గుడి, ముస్లిం పేట, అఫీషియల్ కాలనీలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.