TG: గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ఈ ప్రభుత్వం గ్రూప్ 1,2 ఉద్యోగాలు అమ్ముకుందని కొందరు ప్రచారం చేశారని.. కోర్టుల్లో కేసులు వేశారని వాటన్నింటిని జయించి.. ఇవాళ నియామక పత్రాలు అందించామని అన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేయదని స్పష్టం చేశారు.