NLR: సీతారామపురం మండలం బసినేనిపల్లి వద్ద హైవే పక్కన కరెంట్ స్తంభాలు నిల్వ చేశారు. గత నెలలో ఈ ప్రాంతంలోనే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఇలా రోడ్డు మార్జిన్లో ఎలా పడితే అలా స్తంభాలు నిల్వ చేయడంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైవే నిర్వాహకులు చెప్పినా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించట్లేదని మండిపడుతున్నారు.