బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో రాబోతున్న భారీ చిత్రం ఇవాళ అధికారికంగా ప్రారంభమైంది. దిల్రాజు నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే మొదలైంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.