కృష్ణా: పామర్రు, గుడివాడ నియోజకవర్గాల ముదినేపల్లి మండలం మీదుగా రూ.7.72 కోట్లతో ప్రవహించే కొమరోలు మేజర్ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.