KDP: ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. రూ.80,035లు రాబడి లభించిందని ఆలయం EO శ్రీధర్ తెలిపారు. ప్రొద్దుటూరు టెంపుల్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు సన్నుతి శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, భక్తుల సమక్షంలో హుండీలోని సొమ్మును లెక్కించినట్లు ఈవో తెలిపారు.